MRF: ఒక్కో షేర్ ధర లక్ష రూపాయలు: స్టాక్ మార్కెట్లో పెను సంచలనం
ముంబై: స్టాక్ మార్కెట్లో పెను సంచలనం నమోదైంది. దేశీయ టైర్మేకర్స్ ఎంఆర్ఎఫ్ షేర్లు లక్ష రూపాయల మార్క్ను అధిగమించాయి. ఒక్క షేర్ ధర గరిష్ఠంగా రూ. 1,00,439.95 పైసలకు చేరింది. లక్ష రూపాయల ల్యాండ్ మార్క్ను అందుకున్న తొలి దేశీయ స్టాక్స్గా చరిత్ర సృష్టించింది ఎంఆర్ఎఫ్. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో ఆల్ టైమ్ రికార్డ్ను నెలకొల్పింది.
ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ ఎంఆర్ఎఫ్ షేర్ ధర కొంత క్షీణించినప్పటికీ- అది సృష్టించిన ప్రకంపనలు మాత్రం తగ్గట్లేదు. ఉదయం 11:30 గంటల సమయానికి 99,848 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు 98,968 రూపాయల వద్ద ఎంఆర్ఎఫ్ షేర్ ధర ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభమైన వెంటనే ఉప్పెనలా ఎగిసింది. తొలిగంటలోనే 1,000 రూపాయల మేర పెరిగింది.

ఉదయం 9:45 నిమిషాలకు లక్ష రూపాయలను అధిగమించింది. ఒక్క షేర్ ధర 1,00,066 రూపాయల వద్ద నిలిచింది. క్రమంగా దాని ధర మరింత పెరుగుతూ వెళ్లింది. గరిష్ఠంగా రూ.1,00,439.95 పైసలకు చేరింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం నుంచీ ఎంఆర్ఎఫ్ షేర్ ధర ఎగిసిపడుతూనే వస్తోంది. మే 8వ తేదీన ఎంఆర్ఎఫ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం, వార్షిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తరువాత ఈ పెరుగుదల చోటు చేసుకుంది.
ఫలితాలను వెల్లడించినప్పుడే గరిష్ఠంగా 99,933 రూపాయలు పలికింది ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్. 2021 జనవరిలో మొదటిసారిగా 90,000 రూపాయల మార్క్ను అందుకున్న తరువాత దాని ధరలో స్థిరత్వం కనిపించింది. ఈ మార్క్ దాటి కిందికి రాలేదు షేర్ ధర. సుమారు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత లక్ష రూపాయలను అధిగమించింది.

2012 ఫిబ్రవరిలో ఎంఆర్ఎఫ్ షేర్ ధర తొలిసారిగా 10,000 రూపాయలను అందుకుంది. కంపెనీ యాజమాన్యం ఎప్పుడూ బోనస్ షేర్లను జారీ చేయలేదు గానీ క్రమం తప్పకుండా షేర్ హోల్డర్లకు డివిడెండ్లను చెల్లిస్తూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మే 3వ తేదీన ఒక్కో షేర్పై 10 రూపాయలు చొప్పున తుది డివిడెండ్గా 169 రూపాయలను చెల్లించింది.
మూడు రూపాయలతో రెండు మధ్యంతర డివిడెండ్లను షేర్ హోల్డర్లకు బదలాయించింది. మార్చి 31వ తేదీకి ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేర్పై మొత్తంగా 175 రూపాయల డివిడెండ్ను చెల్లించిందా సంస్థ యాజమాన్యం. షేర్ హోల్డర్లల్లో విశ్వసనీయతను కూడగట్టుకోవడం, కార్యకలాపాల విస్తరణ, చివరి త్రైమాసికంలో 5,725.40 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం వంటి పరిణామాలు ఎంఆర్ఎఫ్ షేర్ ధర పెరగడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications