ములాయంకు స్వైన్ ఫ్లూ లక్షణాలు... నిర్ధారించలేమని వైద్యులు...?
గుర్గావ్: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస సంబంధమైన సమస్యతో అస్వస్థతకు గురికావడంతో ఆయన గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.
ఆయనకు ఊపిరి సరిగా అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. ములాయం శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని, ఆయనకు స్వైన్ఫ్లూ లక్షణాలున్నట్లు కనిపించినా.. ఇప్పుడే నిర్ధారించలేమని ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడొకరు శనివారం తెలిపారు.

ములాయంను కేవలం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెప్పారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సినదేమీలేదని వైద్యులు సూచించారని సమాజ్వాది పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్రచౌదరి చెప్పారు. ములాయంకు డాక్టర్ నరేష్ ట్రెహాన్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు చేస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications