ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకూడదు:సీఎం
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహనగరంలో భారీ వర్షాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు కష్టాలు పడుతున్నారు.
ప్రధానమార్గాల్లో ట్రాఫిక్ స్ధంబించడంతో వాహనదారులు ఇక్కట్లపాలయ్యారు. దాదర్, చెంబూర్, సైన్, వర్లీ, లోయర్ పరేల్ సహ పలు ప్రాంతాలు నీట మునిగాయి.

రైళ్ళు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పలు లోకల్ రైళ్ళు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుతురు మందగించడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.
మరో 48 గంటలపాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీంతో మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు.
అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కోరారు. ట్రాఫిక్ సలహలు పాటించాలని, ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకొంటే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు.
ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించిన అధికారులు స్పందిస్తారని సీఎం చెప్పారు. సహయం కావాల్సిన వారు 100 నెంబర్కు ఫోన్ చేయాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.
ముంబై పోలీస్ వైర్లెస్ నెంబర్. 22633319, బీఎంసీ హెల్ప్లైన్ 1918, బీఎంసీ ల్యాండ్లైన్ 22694719. సివిల్ డిఫెన్స్ కోసం 22856435, ట్రాఫిక్ హెల్ప్ లైన్ కోసం 8454999999, ఎంసీజీఎం హెల్ప్లైన్ కోసం 022 22694725 నెంబర్లకు ఫోన్ చేయాలని సీఎం కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications