రాజ్నాథ్కు టర్బన్ పెట్టిన హత్య కేసు నిందితుడు

గత శనివారం రాజ్నాథ్ సింగ్ శ్రీపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రార్థనల తర్వాత ఆలయం నుంచి మంత్రి వెలుపలికి వచ్చారు. అలా రాగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంతోష్ దగ్గరకు వచ్చి స్థానిక బిజెపి నాయకులు, భద్రతా సిబ్బంది అనుమతితో రాజ్నాథ్ తలను టర్బన్తో అలంకరించారు.
2008లో జరిగిన డివైఎఫ్ఐ కార్యకర్త విష్ణు హత్య కేసులో సంతోష్ ప్రధాన నిందితుడు. ప్రస్తుతం అతను బెయిల్పై బయట ఉన్నాడు. ఈ వివాదంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితల స్పందించారు. అది తీవ్రమైన విషయమేనని, అయితే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏ విధమైన భద్రతా లోపాలు లేవని, రాజ్నాథ్ సింగ్ భద్రత జాతీయ భద్రతా గార్డ్స్ (ఎన్ఎస్జి) చేతిలో ఉంటుందని ఆయన వివరించారు.
సంతోష్ రాజ్నాథ్ సింగ్కు టర్బన్ ప్రదానం చేస్తున్న దృశ్యాలు స్థానిక మీడియాలో వచ్చాయి. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, ఈ సంఘటనపై కాంగ్రెసు నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం, బిజెపి రాష్ట్ర శాఖ వివరణ ఇవ్వాలని సిపిఐ శాసనసభ్యుడు వి శివకుట్టి డిమాండ్ చేశారు. సిపిఎం ఈ సంఘటనపై అనవసర రాద్ధాంతం చేస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అన్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
కొత్త వైరస్ మరణ మృదంగం: ‘షిగెల్లా’ సోకి మూడేళ్ల చిన్నారి బలి.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications