గుడ్న్యూస్: ఈ నెలలో అందుబాటులోకి మైలాన్ రెమ్డెసివర్ డ్రగ్, ఒక్కో బాటిల్ రూ.4800..
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ కేసుల్లో రష్యాను అధిగమించి మూడో ప్లేస్లోకి భారత్ వచ్చింది. అయితే వైరస్ నివారణ కోసం మందులను కూడా ఫార్మా కంపెనీలు కనిపెడుతూనే ఉన్నాయి. ఇందులో ప్రథమంగా వినిపించే పేరుగా గిలీడ్ సైన్సెస్కు చెందిన రె్ డిసివర్ డ్రగ్. జనరిక్ ఔషధం వినియోగించేందుకు తమకు అనుమతి వచ్చిందని మైలాన్ ఎన్బీ కంపెనీ పేర్కొన్నది. ఈ నెలలో మందు అందజేస్తామని.. 100 మిల్లీ గ్రాముల బాటిల్ ధర రూ.4800 ఉంటుందని పేర్కొన్నది.
కరోనా నివారణ మందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సోకినవారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందజేస్తున్నారు. కొన్ని యాంటీ వైరల్ మందులు కూడా ఇస్తున్నారు. అమెరికాలో జరిపిన పరిశోధనల్లో రెడ్ డెసివర్ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నాని తెలింది. భారత్తోపాటు ఇతర దేశాల్లో కూడా గిలీడ్ సైన్సెస్ జనరిగ్ ఔషధంగా విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే దేశంలో మాత్రం అత్యవసరంగా మాత్రమే ఉపయోగిస్తారు.
Recommended Video
కరోనా వైరస్ నివారణ కోసం ఇప్పటికే సిప్లా లిమిటెడ్ సిప్రెమి, హెటిరో కొవిఫర్ పేరుతో రెడ్ డెసివర్ విక్రయిస్తున్నారు. సిప్రెమీ ధర రూ.5 వేలు కాగా, కొవిఫర్ రూ.5400కు సేల్ చేస్తున్నారు. ఒక్కో దేశంలో ఒకలా రెమ్ డెసివర్ గిలీడ్ వైరస్ నివారణ మందు విక్రయిస్తోంది. దేశంలో డాక్టర్ రెడ్డీస్, జూబిలెంట్, సింజెన్, జైడస్ క్యాడిలాకు కంపెనీ అనుమతులు ఇచ్చింది.