ఇన్పీలో నందన్ నీలేకనికి 'నో సాలరీ': కంపెనీ ఏం చెప్పిందంటే?..
నందన్ నీలేకని చివరిసారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది.
బెంగళూరు: ఇన్ఫోసిస్ సమస్యలను చక్కదిద్దడానికి రీఎంట్రీ ఇచ్చిన సంస్థ మాజీ సీఈవో నందన్ నీలేకనీ.. వేతనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని ఇన్ఫీ ప్రతినిధులు స్పష్టం చేశారు. నందన్ నీలేకని చివరిసారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్లో నందన్ నీలేకనికి 0.93శాతం వాటా ఉంది. సీఈవోగా విశాల్ సిక్కా తప్పుకోవడంతో ఇన్ఫీ కొత్త చైర్మన్గా నందన్ నీలేకని అగస్టు 24న పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా తన స్థానంలో కొనసాగుతున్నారని, ఈ బాధ్యతలు నిర్వర్తించినందుకు గాను షేర్ హోల్డర్స్ ఆమోదించిన మేరకు ఆయన వేతనం తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.

తాత్కాళికంగా చేపట్టిన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రం ఆయన ఎలాంటి అదనపు వేతనాన్ని తీసుకోవడం లేదని తెలిపింది. ఇన్ఫోసిస్ కి కొత్త చైర్మన్ గా వచ్చిన నందన్ నీలేకని తక్షణ కర్తవ్యంగా కంపెనీలో స్థిరత్వం సంపాదించడంతో పాటు కొత్త సీఈవోను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఇగోన్ జెహెండర్ అనే ఎగ్జిక్యూటివ్ రిక్రూట్ మెంట్ సంస్థను కూడా కంపెనీ నియమించుకున్నట్లు నీలేకని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications