మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు: కేరళ ఎన్సీపీ అభ్యంతరం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతిస్తామన్న ఎన్సీపీ ప్రకటనపై కేరళ ఎన్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సీనియర్ ఎమ్మెల్యే ఏకే శశీంద్రన్ మీడియాకు వెల్లడించారు.
ఈ మేరకు తమ అభిప్రాయాన్ని ఎన్సీపీ కేంద్ర నాయకులకు తెలియజేసినట్లు తెలిపారు. ఈ ప్రకటన పార్టీ సిద్దాంతాలకు విరుద్దమని, అవకాశ వాదం అవుతుందని శశీంద్రన్ పేర్కొన్నారు.

దేశంలోని రాష్ట్ర విభాగాలను సంప్రదించకుండా కేంద్ర న్యాయకత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సీపీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం 'మతతత్వ శక్తులు'లకు దగ్గరయ్యేలా ప్రయత్నిస్తోందని అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్టయితే బయటనుంచి మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్సీపీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని భావిస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications