ఇండియా టుడే ఎగ్జిట్పోల్ ఫలితాల్లో ఎన్డీఏకు ఆధిక్యత
2019 ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 10 నుండి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో పూర్తిగా ఎన్డీఏకు అధిక స్థానాలు వచ్చాయి ఏన్డీఏ అయితే పూర్తి మెజరిటీ దక్కే అవకాశాలు కనిపించాయి. .పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా 300 మార్కు దాటే పరిస్థితి కూడ ఉన్నట్టు కనిపిస్తుంది.
ఏపిలో వైసీపీకి 18 నుండి 20, టీడీపీ 4 నుండి 6 స్థానాలు
కాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మొదటి ఫేజ్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు,తమిళనాడు,కేరళ రాష్ట్ర్రాల్లో ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను చూస్తే నాలుగు దక్షినాది రాష్ట్ర్రాల ఫలితాల్లో ఏన్డీఏ 23 నుండి 33 యూపిఏ 55 నుండి 63 మెజారీటీ సీట్లు రాగా ఇతర పార్టీలైన టీఆర్ఎస్ ,వైసీపీలతో 35 నుండి 46 స్థానాలను ప్రకటించింది. అయితే అన్ని వర్గాలు ఉహించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనుకున్న స్థాయిలోనే ఎంపీ సీట్లను స్వీప్ చేశాడు. వైసీపీకి ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్స్పోల్స్ ఫలితాల్లో 214లో 8 స్థానాలను గెలుపోందగా 2019లో మాత్రం 100 శాతం అదనంగా సీట్లను వైసీపీ సాధించింది.ఈనేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి 18 నుండి 20 ఎంపీ స్థానాలు గెలుపొందనుండగా టీడీపీకి మాత్రం డీలా పడింది. అధికారంలో చంద్రబాబుపై ప్రజలు వ్యతిరేకత కనబరిచారు. ఈనేపథ్యంలోనే టీడీపీ మొత్తం 25 స్థానాలకు గాను 4 నుండి 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్టు ఎగ్గిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ 10 నుండి 12 ,బీజేపీకి 1 నుండి 2
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ భావించినట్టుగా క్లీ్న్స్వీప్ చేసే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లీన్స్వీప్ చేసే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి గతంలో కంటే ఒక స్థానం పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల్లో వెలువడ్డాగా మొత్తం తెలంగాణలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 నుండి 12 స్థానాలు గెలుపొందగా.. బీజేపీకి 1నుండి రెండు స్థానాలు గెలువబోతున్నట్టు తెలిపింది. ఇక ఎంఐఎం తన స్థానాన్నిపదిలపరుచుకోగ కాంగ్రెస్ మాత్రం తన పదిలపరచుకోలేకపోతున్నట్టు ఎగ్జిట్పోల్ ఫలితాలు వెలువరించాయి.