Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Union Budget 2025: తేల్చేసిన కేంద్రం - వాట్ నెక్స్ట్..!!

Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ బిజినెస్ గురించి స్పష్టత ఇచ్చింది. వక్ఫ్ బిల్లుతో పాటుగా 16 బిల్లులను సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. టీడీపీ, వైసీపీ ఏపీ అంశాల పైన సమావేశంలో ప్రస్తావించారు.

అఖిలపక్ష భేటీలో
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్‌ సమావేశాలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఓం బిర్లాకు వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేసింది. జేపీసీ చైర్మన్‌ జగదాంబికా పాల్‌ ఆధ్వర్యంలో ఎంపీలు స్పీకర్‌ను కలిసి నివేదిక సమర్పించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్‌ అభ్యర్దించారు.

NDA government is likely to introduce 16 Bills including Immigration and Foreigners Bill during the Budget Session

సభ ముందుకు కీలక బిల్లులు
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ బిల్లుతో పాటుగా కీలకమైన అక్రమ వలసదారుల నియంత్రణకు సంబంధించిన ద ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్‌ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. బ్యాంకింగ్‌ లాస్‌ సవరణ బిల్లు, ఇండియన్‌ రైల్వేస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవపల్‌మెంట్‌ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బాయిలర్స్‌ బిల్లు, గోవా అసెంబ్లీలో ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల రీ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లు లను సభలో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రతిపక్షాల హామీ
పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించేందుకు సిద్దమని ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రతిపక్ష నేతలు చెప్పుకొచ్చారు. తొలి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభ మై ఏప్రిల్‌ 4న ముగియనున్నాయి. మార్చి 10న ఉభయసభలు తిరిగి ప్రారంభమవుతాయి. కాగా, టీడీపీ - వైసీపీ నేతలు ఏపీకి కేంద్రం పెండింగ్ హామీలు.. రాష్ట్రంలోని అంశాల పై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైన దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తితో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+