Union Budget 2025: తేల్చేసిన కేంద్రం - వాట్ నెక్స్ట్..!!
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ బిజినెస్ గురించి స్పష్టత ఇచ్చింది. వక్ఫ్ బిల్లుతో పాటుగా 16 బిల్లులను సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. టీడీపీ, వైసీపీ ఏపీ అంశాల పైన సమావేశంలో ప్రస్తావించారు.
అఖిలపక్ష భేటీలో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలపై గురువారం పార్లమెంట్ ఆవరణలో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. స్పీకర్ ఓం బిర్లాకు వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేసింది. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో ఎంపీలు స్పీకర్ను కలిసి నివేదిక సమర్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్ అభ్యర్దించారు.

సభ ముందుకు కీలక బిల్లులు
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ బిల్లుతో పాటుగా కీలకమైన అక్రమ వలసదారుల నియంత్రణకు సంబంధించిన ద ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, ఇండియన్ రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవపల్మెంట్ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బాయిలర్స్ బిల్లు, గోవా అసెంబ్లీలో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల రీ అడ్జస్ట్మెంట్ బిల్లు లను సభలో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ప్రతిపక్షాల హామీ
పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించేందుకు సిద్దమని ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రతిపక్ష నేతలు చెప్పుకొచ్చారు. తొలి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభ మై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. మార్చి 10న ఉభయసభలు తిరిగి ప్రారంభమవుతాయి. కాగా, టీడీపీ - వైసీపీ నేతలు ఏపీకి కేంద్రం పెండింగ్ హామీలు.. రాష్ట్రంలోని అంశాల పై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైన దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తితో ఉన్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications