అడిగారు గానీ సీటు మారాలనుకోలేదు: అద్వానీ

భోపాల్ నుంచి కూడా పోటీ చేయాలని మధ్యప్రదేశ్కు చెందిన తన మిత్రులు అడిగారని, అయితే తాను గాంధీనగర్ నుంచి పోటీ చేయకూడదని ఏనాడూ అనుకోలేదని ఆయన అన్నారు. గాంధీనగర్ నుంచి కాకుండా భోపాల్ నుంచి పోటీ చేయాలని అద్వానీ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆర్ఎస్ఎస్, పార్టీ జోక్యంతో ఆయన తన మనసు మార్చుకున్నట్లు చెబుదతున్నారు.
తాను ఎన్నికల్లో పోటీ చేయడంతోనే తన అనుబంధం గుజరాత్తో గానీ గాంధీనగర్తో గానీ ప్రారంభం కాలేదని, భారత స్వాతంత్ర్యం సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటననాడే ప్రారంభమైందని ఆయన చెప్పారు. దేశ విభజన తర్వాత తనకుటుంబం పాకిస్తాన్ నుంచి భారత్కు మారిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
తమ కుటుంబం ఆదిపూర్కు మారినప్పుడు తనకు మూడు నాలుగేళ్ల వయస్సు మాత్రమే ఉందని, గుజరాత్తో తన అనుబంధం అప్పటి నుంచి ప్రారంభమైందని ఆయన చెప్పారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వెంట రాగా అద్వానీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications