Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా తెరచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు

తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడిగా ఎంపికైన ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి బాధ్యతలను స్వీకరించారు. ఆయన చేతుల మీదుగా ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ తెల్లవారు జామున 4 గంటలకు వృశ్చిక లగ్నంలో సంప్రదాయబద్ధంగా మణికంఠుడికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ తలుపులను పరమేశ్వర్ నంబూద్రి తెరిచారు. అనంతరం అయ్యప్పుడి భక్తులకు సన్నిధానంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.

సోమవారం సాయంత్రం పాత ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా..

సోమవారం సాయంత్రం పాత ప్రధాన అర్చకుడి చేతుల మీదుగా..

మండలం-మకరవిళక్కు పూజల కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ప్రధాన అర్చకుడు వీకే జయరాజ్ పొత్తి ఆలయాన్ని తెరిచారు. తంత్రి కందరు మహేష్ మోహనరు సమక్షంలో స్వామివారి గర్భగుడిని తెరిచారు. స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం పదవీ విరమణ చేశారు. తన బాధ్యతలను పరమేశ్వరన్ నంబూద్రికి అప్పగించారు. ఈ తెల్లవారు జామున ఆయన గర్భగుడి ఆలయం తలుపులను తెరిచారు.

26వ తేదీ వరకు మండలం పూజలు..

26వ తేదీ వరకు మండలం పూజలు..

అలాగే- మాలికాప్పురం అమ్మవారి ఆలయానికి కూడా ప్రధాన అర్చకుడిగా కొత్తగా నియమితులైన శంభు నంబూద్రి కూడా బాధ్యతలను స్వీకరించారు. మండలం-మకరవిళక్కు పూజలు డిసెంబర్ 26వ తేదీ వరకు కొనసాగుతాయి. మండలం పూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు అర్చకులు. మళ్లీ అదేనెల 30వ తేదీన మకరవిళక్కు పూజల కోసం తెరుస్తారు. కొత్త సంవత్సరం జనవరి 20వ తేదీ వరకు తెరచి ఉంచుతారు.

జనవరి 20 వరకు ఓపెన్..

జనవరి 20 వరకు ఓపెన్..

అయ్యప్పుడిని దర్శించుకోవడానికి 19వ తేదీ వరకే భక్తులకు అనుమతి ఉంటుంది. జనవరి 14వ తేదీన జ్యోతి దర్శనం ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజూ 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ లేదా- రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భక్తులు.. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.

ఎవరీ పరమేశ్వరన్..

ఎవరీ పరమేశ్వరన్..

నారాయణన్ నంబూద్రి, సుభద్ర అంతర్జనం దంపతుల కుమారుడు పరమేశ్వరన్. ఇదివరకు ఆయన హరిపద్‌లోని ఛెట్టికులంగారా ఆలయం, పంపా మహాగణపతి దేవస్థానాలకు ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎవూర్‌లోని శ్రీకృష్ణస్వామి దేవస్థానంలో పని చేస్తోన్నారు. పరమేశ్వరన్ వివాహితుడు. ఆయన భార్య పేరు ఉమాదేవి అంతర్జనం. ఆయనకు ఇద్దరు కుమారులు నారాయణన్ నంబూద్రి, విష్ణు నంబూద్రి ఉన్నారు. పరమేశ్వరన్ స్వస్థలం అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర.

లక్కీ డ్రా ద్వారా..

లక్కీ డ్రా ద్వారా..

కిందటి నెల 17వ తేదీన శబరిమల ఆలయంలో నిర్వహించిన లక్కీ డ్రా సందర్భంగా పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. తొలుత- ప్రధాన అర్చకుడి కోసం ఎంపిక చేసిన తొమ్మిదిమంది పేర్లు రాసిన చీటీలతో కూడిన ఓ వెండి పాత్రను అయ్యప్ప స్వామి వద్ద ఉంచారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల అనంతరం వెండి పాత్రను తెరచి అందులో చేతికి అందిన చీటీ ద్వారా ప్రధాన అర్చకుడి పేరును ప్రకటించారు. సుదీర్ఘకాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ ప్రకారం.. పండలం కుటుంబీకులు ఈ లాటరీని తీయాల్సి ఉంటుంది.

మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో

మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో

పండలం కుటుంబీకుడు గోవింద వర్మ లాటరీ తీశారు. అందులో పరమేశ్వరన్ నంబూద్రి పేరు రావడంతో.. ఆయనను శబరిమల దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ప్రకటించారు. దేవస్వొం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు, కేరళ హైకోర్టు పరిశీలకుడిగా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ భాస్కరన్.. ఈ లాటరీని పర్యవేక్షించారు. ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. మాలికాప్పురం దేవి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఎంపికైన శంభు నంబూద్రి.. స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పరియారం. కోజికోడ్‌లో నివాసం ఉంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+