మహా రసవత్తరం: డిసెంబర్ 2 లేదా 5 ముహూర్తం?
New Maharashtra CM: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఏక్నాథ్ షిండే తన మనసు మార్చుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నా ఆయన మెత్తబడట్లేదు.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. షిండేకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేదా కనీసం 50:50 పవర్ షేర్ ఫార్ములాను అయినా అంగీకరించాలని ప్రతిపాదిస్తోంది. ఇప్పటివరకు షిండే సేన పెట్టిన ఏ ఒక్క డిమాండ్కు కూడా బీజేపీ తల ఊపలేదు.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోందా పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలని, ఫడ్నవీస్ను అయిదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చూడాలనే పట్టుదలతో ఉంది. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రతిష్ఠంభనకు దారి తీసింది.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది షిండే వర్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. దీనికి ప్రతిగా తాము పెట్టిన డిమాండ్లను అంగీకరిస్తే తప్ప లొంగే ప్రసక్తే లేదనే సమాచారాన్ని బీజేపీ అధిష్ఠానానికి పంపించింది. దీనికి నిదర్శనమే- ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన మహాయుటి కూటమి భేటీ రద్దు కావడం.

తన సొంత ఊరికి వెళ్లిన షిండే కోసం రాయబారాలు కొనసాగిస్తోంది బీజేపీ. బుజ్జగింపులు చేపట్టింది. అన్నింటినీ కాకపోయినా కొన్ని డిమాండ్లయినా ఒప్పుకోవడానికి పార్టీ అధిష్ఠానం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె చెబుతున్నారు.
షిండే మొండి పట్టు పట్టట్లేదని, ఆయన అనారోగ్య కారణాల వల్ల మహాయుటి భేటీకి హాజరు కాలేదని శివసేన చెబుతోంది. కొంత విశ్రాంతి తీసుకోవాలనే కారణంతో సతారా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లారని, ఒకటి రెండు రోజుల్లో ముంబైకి తిరిగి వస్తారని సంజయ్ శ్రీసత్ తెలిపారు. నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications