బెంగాల్ బీజేపీ ఛీఫ్ గా సుకాంత మజుందార్-అంచనాలకు తగ్గట్టు పనిచేస్తానని ప్రకటన
పశ్చిమబెంగాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన బీజేపీకి ప్రజలు మాత్రం బ్రహ్మరధం పట్టలేదు. దీంతో అసలే ఓటమి బాధలో ఉన్న బీజేపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాకులు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా గతంలో టీఎంసీ నుంచి బీజేపీలో చేరి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తిరిగి తృణమూల్ కు వెళ్లిపోవడం మొదలుపెట్టేశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ హైకమాండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసింది.
దిలీప్ ఘోష్ స్థానంలో బిజెపి పశ్చిమ బెంగాల్ యూనిట్ అధ్యక్షుడిగా నియమితుడైన బాలూర్ఘాట్ ఎమ్మెల్యే సుకంత మజుందార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియామకంతో పాటు టీఎంసీలోకి ఫిరాయిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలపైనా సుకాంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక సాధారణ పార్టీ కార్యకర్తకు ఇంత పెద్ద బాధ్యతను" ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వానికి సుకాంత కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత, అనేక మంది సీనియర్ నాయకులు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించిన కొన్ని నెలల తర్వాత సుకంత మజుందార్ నియామకం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన.. సాధారణ కార్యకర్తకు పార్టీ ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చింది. ఇది బిజెపిలో మాత్రమే సాధ్యమవుతుంది. మరే ఇతర రాజకీయ పార్టీలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేవన్నారు.. నేను హైకమాండ్ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

తనను అధ్యక్షుడిగా ప్రకటించిన కొద్దిసేపటికే దీనిపై స్పందించిన సుకాంత మజుందార్ బిజెపి ఒక పెద్ద కుటుంబం, అందులో సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉండవచ్చొన్నారు. సైద్ధాంతిక కారణాల వల్ల బిజెపిలో ఉన్నవారు వదలరని నాకు నమ్మకం ఉంది. నిర్లక్ష్యానికి గురైన మా కార్మికులకు నేను క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భావజాలంలో తేడాలు లేవు. అభిప్రాయాలలోని విభేదాలను పరిష్కరించవచ్చుకోవచ్చని ఫిరాయింపు దారులకు ఆయన చెప్పారు. ఇందుకోసం ఈ నెల 26న ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిజెపిని వదిలే వారు ఏవో ఉద్దేశాలతో పార్టీలో చేరారని, అవి నెరవేరకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు సుకాంత తెలిపారు. బిజెపి సిద్ధాంతంపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ వదలరని ఆయన పేర్కొన్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications