టీవీ ఛానెల్ చీఫ్ ఎడిటర్ మీద లైంగిక వేదింపుల కేసు
గౌహతి: మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఘటనలో ఓ న్యూస్ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
అసోంలోని గౌహతికి చెందిన ప్రయివేటు టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అటాను భుయాన్ లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అదే విధంగా సదరు ఛానెల్ యజమాని, అసోం మంత్రి రోకిబుల్ హుస్సేన్ పై ఢిల్లీ మహిళా కమీషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు.
చీఫ్ ఎడిటర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ టీవీ ఛానెల్ యజమాని, మంత్రికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని, తన ఉద్యోగం తీసేసి చేతులు దులుపుకున్నారని ఆమె మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

2015 ఆగస్టులో ఆమె టీవీ చానెల్ లో జర్నలిస్టుగా చేరారు. తరువాత చానెల్ సీఈవో తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోరిక తీర్చాలని పదేపదే అతను ఫోన్ చేసి వేధించాడని ఆమె ఆరోపించింది.
అర్దరాత్రి డ్యూటీ చెయ్యాలని వేధింపులకు గురి చేశారని తన ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం గౌహతి చేరుకుని విచారణ చేపట్టింది.
అయితే ఈ విషయంపై స్పందించడానికి టీవీ ఛానెల్ యజమాని, అసోం మంత్రి, ఛానెల్ చీఫ్ ఎడిటర్ మీడియాకు అందుబాటులోకి రావడం లేదు. పలువురు మీడియా సభ్యులు వీరి నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications