ఎన్ఐఏ అధిపతిగా.. గుజరాత్ అల్లర్ల ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోడీని కేంద్రప్రభుత్వం నియమించింది. మోడీ నియామకానికి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోడీని కేంద్రప్రభుత్వం నియమించింది. మోడీ నియామకానికి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.
ఈ మేరకు సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. వైసీ మోడీ ఎన్ఐఏ డీజీగా 2021 మే 31 వరకు కొనసాగుతారని అందులో పేర్కొంది. దీంతోపాటు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎన్ఐఏలో వెంటనే చేరుతారని కూడా తెలిపింది.

1984 బ్యాచ్కు చెందిన వైసీ మోడీ అసోం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2002లో గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్ఐఏ అధిపతి శరద్కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోడీ బాధ్యతలు స్వీకరిస్తారు.
2013 జూలైలో ఎన్ఐఏ చీఫ్గా నియమితులైన శరద్ పదవిని కేంద్రం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. ఎన్ఐఏ డీజీగా ఆయన అత్యధిక కాలం పనిచేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రాను సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్గా డీవోపీటీ నియమించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications