Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్‌ఐఏ అధిపతిగా.. గుజరాత్ అల్లర్ల ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి!

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోడీని కేంద్రప్రభుత్వం నియమించింది. మోడీ నియామకానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోడీని కేంద్రప్రభుత్వం నియమించింది. మోడీ నియామకానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.

ఈ మేరకు సోమవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. వైసీ మోడీ ఎన్‌ఐఏ డీజీగా 2021 మే 31 వరకు కొనసాగుతారని అందులో పేర్కొంది. దీంతోపాటు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎన్‌ఐఏలో వెంటనే చేరుతారని కూడా తెలిపింది.

Next NIA Chief YC Modi was part of Gujarat Roit SIT

1984 బ్యాచ్‌కు చెందిన వైసీ మోడీ అసోం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2002లో గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్‌ఐఏ అధిపతి శరద్‌కుమార్ నుంచి అక్టోబర్ 30న వైసీ మోడీ బాధ్యతలు స్వీకరిస్తారు.

2013 జూలైలో ఎన్‌ఐఏ చీఫ్‌గా నియమితులైన శరద్ పదవిని కేంద్రం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. ఎన్‌ఐఏ డీజీగా ఆయన అత్యధిక కాలం పనిచేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రజనీకాంత్ మిశ్రాను సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్‌గా డీవోపీటీ నియమించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+