ధర్డ్ వేవ్ పై WHO క్లారిటీ-వచ్చే రెండు వారాలే కీలకం-ఏం జరగబోతోంది ?
భారత్ లో ధర్డ్ వేవ్ పై జనంలో భయాలు పెరుగుతున్నాయి. రోజుకో రకం వార్తలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓవైపు సాధారణ కోవిడ్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్ లో ధర్డ్ వేవ్ వచ్చేసిందన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణలు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ధర్డ్ వేవ్ ప్రభావం భారత్ పై పడుతుందా లేదా అనేది చెప్పడానికి వచ్చే రెండు వారాలు కీలకంగా మారబోతున్నాయని వెల్లడించారు.

కోవిడ్ 19 ధర్డ్ వేవ్
భారత్ పై కరోనా ధర్డ్ వేవ్ విజృంభిస్తోందా, వరుసగా పెరుగుతున్న కరోనా కేసులు ధర్డ్ వేవ్ కు సూచికగా మారబోతున్నాయా అంటే అవునని కొందరు, కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ధర్డ్ వేవ్ వచ్చేసినట్లేనని కొందరు విశ్లేషిస్తుండగా.. మరికొందరు మాత్రం అప్పుడే ధర్డ్ వేవ్ వచ్చినట్లు కాదంటున్నారు. కేంద్రం కూడా అధికారికంగా ధర్డ్ వేవ్ వచ్చిందని ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ధర్డ్ వేవ్ కు పరిస్ధితులు దారి తీయకుండా తాము గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని మాత్రమే రాష్ట్రాల్ని కోరుతోంది.

వచ్చే రెండు వారాలే కీలకం
ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా వచ్చే రెండు వారాలు కీలకంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్ధకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్, ఓమిక్రాన్ తో పోరాడుతున్న భారత్.. ధర్డ్ వేవ్ ముప్పు బారిన పడిందా లేదా తెలియాలంటే రాబోయే రెండు వారాల్లో తీసుకోబోయే చర్యలు కీలకంగా మారబోతున్ననట్లు సౌమ్య వెల్లడించారు. దీంతో ఈ రెండు వారాల్లో ప్రభుత్వాల పాత్ర నిర్ణయాత్మకంగా మారిపోయింది.

ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదన్న డబ్ల్యూహెచ్వో
అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తాజాగా ఓ ట్వీట్ కూడా చేసారు. ఇందులో
"ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదు. ఆరోగ్య వ్యవస్థలు నిష్ఫలంగా ఉండవచ్చు. పెద్ద సంఖ్యలో రోగులను పరీక్షించడానికి, సలహా ఇవ్వడానికి, పర్యవేక్షించడానికి వ్యవస్థలను కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే కరోనా కేసుల పెరుగుదల ఆకస్మికంగా, భారీగా ఉంటుందని ఆమె విశ్లేషించారు.

జనవరి చివర్లో పీక్
భారత్ లో తాజాగా 54 వేల కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ది ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ, సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ గిరిధర బాబు మాట్లాడుతూ... తాజా అంచనాల ప్రచారం జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారం మధ్య కాలంలో కరోనా కేసులు గరిష్ట స్థాయిని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే భారత్ దీన్ని ఎదుర్కొనేందుకు డెల్టా వేరియంట్ వచ్చిన సమయంతో పోలిస్తే ఇప్పుడు సర్వసన్నద్ధంగా ఉందన్నారు. తద్వారా కేసులు పతాకస్ధాయికి చేరినా భారత్ దాన్ని ఎదుర్కోవడం ఖాయమన్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications