వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాంజాపై దేశవ్యాప్త నిషేధం.. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం..
మాంజాపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది.
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో 'మాంజా'పై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. మాంజాపై పూసే గాజు, లోహాల పొడి పూత మనుషులతో పాటు జంతువులు, పక్షులకు ప్రమాదకరమని పేర్కొంటూ బుధవారం నాడు గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది.
పర్యావరణానికి మాంజా ద్వారా హాని ఉన్నందునా.. దాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, షాదన్ ఫరాసత్ చేసిన విజ్ఞప్తి మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. మాంజా దుష్ప్రభావాలపై జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా భారత మాంజా సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
English summary
The National Green Tribunal on Wednesday imposed an interim nationwide ban on use of glass-coated 'manja' for flying kites as the sharp string poses a danger to humans, animals and birds.