ఐదుగురు కార్యకర్తల అరెస్ట్: మహారాష్ట్ర, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్ట్ వ్యవహారంలో వ్యవహారంలో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. అంతేగాక, ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో వాస్తవిక నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) కోరింది.

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తర్వాత నోటీసులు పంపించామని ఎన్హెచ్ఆర్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణె పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్తల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేసి, అరెస్టులు చేశారు.
విరసం నేత వరవరరావు, అరుణ ఫెరారీ, వెర్నాన్ గోన్ సాల్వేస్, రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్, గౌతమ్ నావ్లాఖ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వీరి అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి.
-
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..!












Click it and Unblock the Notifications