Budget: నిర్మలా సీతారామన్ రికార్డుల చరిత్ర, ఈసారి సరికొత్త రికార్డ్ ఏమిటంటే?

న్యూఢిల్లీ: పార్లమెంటులో మంగళవారం ఉదయం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి మరో రికార్డును నమోదు చేశారు. 2019లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి తన తొలి బడ్జెట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే.

అత్యంత సుదీర్ఘమైన ప్రసంగాల రికార్డు నిర్మలా సీతారామన్

అత్యంత సుదీర్ఘమైన ప్రసంగాల రికార్డు నిర్మలా సీతారామన్


ఆ స్పీచ్‌తో ఆమె అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాల రికార్డును బద్దలు కొట్టారు. ఆమె రెండు గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. మరుసటి సంవత్సరం, 2020-21 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ రెండు గంటల 42 నిమిషాల పాటు మాట్లాడిన ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. అంతేగాక, అది పూర్తి ప్రసంగం కూడా కాదు! ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె తన ప్రసంగాన్ని తగ్గించవలసి వచ్చినప్పుడు ఆమెకు రెండు పేజీలు మిగిలి ఉన్నాయి.

అత్యంత తక్కువ బడ్జెట్ కూడా నిర్మలా సీతారామనే

అత్యంత తక్కువ బడ్జెట్ కూడా నిర్మలా సీతారామనే

మరి ఈ ఏడాది బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఎలాంటి రికార్డు నమోదు చేశారంటే..
ఫిబ్రవరి 1, మంగళవారం నాడు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ 2022 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఆమె మొత్తం గంటన్నర సేపు మాత్రమే ప్రసంగించారు.
అయితే, ఆమె ఇప్పటివరకు నాలుగు బడ్జెట్‌లను సమర్పించారు. ఈ సంవత్సరం, ఆమె తన అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని అందించారు. 2021లో ఆమె బడ్జెట్ ప్రసంగం 100 నిమిషాల నిడివి ఉంది. సగటున, బడ్జెట్ ప్రసంగం 90 నుంచి 120 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటుంది. నిర్మలా సీతారామన్ కంటే ముందు, జస్వంత్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్-ప్రసంగ రికార్డును కలిగి ఉన్నారు. 2003లో ఆయన 2 గంటల 15 నిమిషాల బడ్జెట్‌ను సమర్పించారు. ఇదిలా ఉండగా, స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో హిరూభాయ్ ఎం పటేల్ చేశారు. ఆయన కేవలం 800 పదాల మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. మాట్లాడే మాట విషయానికొస్తే, 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.

తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్

తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్

కాగా, నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కే దక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మలా సీతారామనే కావడం గమనార్హం. ఇప్పడు ఆమె వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతూ ఎవరికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఎక్కువ సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్‌ 10 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ 9 సార్లు, యశ్వంత్‌రావు చౌహాన్‌, సీడీదేశ్ ముఖ్‌ 7 సార్లు, టీటీ కృష్ణమాచారి, మన్మోహన్‌ సింగ్‌ 6 సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Recommended Video

    Union Budget 2022: All You Need To Know About The Schedule | Oneindia Telugu
    అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ అంటూ..

    అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ అంటూ..

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన నాల్గవ బడ్జెట్‌ను సమర్పించారు, ఇది భారతదేశానికి 'ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ' ట్యాగ్‌ను కొనసాగించే లక్ష్యంతో ఉంది. ఫిబ్రవరి, మార్చిలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు బడ్జెట్ రావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం కుదింపు తర్వాత మార్చిలో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+