బడ్జెట్ సెషన్ : మన్మోహన్ సింగ్‌తో నిర్మల సీతారామన్ భేటీ, పద్దుకు ముందు భేటీతో ప్రాధాన్యం

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆయా విభాగాల నుంచి కేటాయింపులకు సంబంధించి వివరాలు తీసుకొని .. పద్దును రూపకల్పన చేశారు. ఇప్పటికే హల్వా తయారు చేసి బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సలహాలు .. సూచనలు ...
బడ్జెట్ ప్రవేశపెట్టే కొద్దిరోజుల ముందు ఆమె మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా ..ఇవాళ ఢిల్లీలో మన్మోహన్‌తో భేటీ అయ్యారు. 1991లో పీవీ నరసింహరావు ప్రభుత్వలో మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రూపాయి విలువ పడిపోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి .. మన్మోహన్ సింగ్‌తో నిర్మలా చర్చించినట్టు తెలిసింది.

Nirmala Sitharaman Meets Manmohan Singh Days Before Her First Budget

సభకు దూరంగా ...
గత 30 ఏళ్ల నుంచి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఈసారి అతని రాజ్యసభ పదవీకాలం ముగియడంతో సభకు రాలేకపోతున్నారు. దీంతో 1986 తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి దూరం కానున్నారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ .. రెండుసార్లు ప్రధాని పదవీ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ తొలి పూర్తిస్థాయిలో ఆర్థికమంత్రిగా నిర్మలా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇందిరాగాంధీ ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ప్రధాని పదవీతోపాటు ఆర్థికమంత్రి పోర్ట్ పోలియో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+