నితీశే సీఎం: ఏకగ్రీవంగా ఎంచుకున్న బీహార్ ఎన్డీఏ ఎమ్మెల్యేలు -బీజేపీ బడా నేతల గైర్హాజరు
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎంపికయ్యారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో.. నాలుగు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీశ్ పేరును సమర్థించారు. దీంతో ఎలాంటి నాటకీయత లేకుండా సీఎం సీటులో నితీశ్ చేరికకు మార్గం సుగగం అయింది. కీలకమైన ఈ సమావేశానికి ఒక్క రాజ్ నాథ్ సింగ్ తప్ప బీజేపీ బడా నేతలు గైర్హాజరుకావడం గమనార్హం.
Recommended Video
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించి, అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, గతంలో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఈసారి 74 సీట్లతో ఎన్డీఏలో సీనియర్ స్థానాన్ని ఆక్రమించగా, 43 సీట్లతో జేడీయూ జూనియర్ అయిపోయింది. సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా, తొలి నుంచీ తాము చెబుతున్నట్లుగానే నితీశ్ కుమార్ ను సీఎంగా కొనసాగిస్తామని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో..

పాట్నాలో ఆదివారం జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యే సమావేశంలో నితీశ్ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. వీలైతే ఆదివారమే ఎన్డీఏ నేతలంతా బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా ఎమ్మెల్యేల జాబితాతో వినతి పత్రం అందించే అవకాశాలున్నాయి. ఆదివారం నాటి పరిణామాలతో నితీశ్ బీహార్ సీఎంగా ఏడోసారి ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమైంది.
బీహార్ సీఎంగా నితీశ్ కు ఇది నాలుగో టర్మ్ అవుతుంది. అయితే, మధ్యలో కూటములు మారడం, వివిధ కారణాల వల్ల ఆయన సీఎంగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ ఆ పదవిలో 8 రోజులున్నారు. 2005, 2010, 2015 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో పూర్తికాలం పదవిలో ఉన్నారు. 1977 ఎన్నికల్లో తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నితీశ్... ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాతి కాలంలో శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతూ ఎన్నికల్లో పోటీచేయని ఆయన తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications