దిశా రవి నో బెయిల్.. జైలులోనే ఆమెకు సౌకర్యమా..? రైతులను సమర్థిస్తే దేశద్రోహమా..
పర్యావరణ వేత్త దిశా రవి బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులను మంగళవారం వరకు ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. టూల్ కిట్ కేసులో దిశా రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతానా ములుక్, నికితా జాకొబ్, ఇతరులు ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చారు.
దిశా రవి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో శనివారం మూడుగంటల కొనసాగాయి. దిశా రవి తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వాలని వాదించగా.. ఢిల్లీ పోలీసుల తరఫున న్యాయవాది వ్యతిరేకించారు. కరోనా వల్ల కేసు వాదనలు వర్చువల్గా కొనసాగాయి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఢిల్లీ పోలీసుల తరఫున వాదించారు. ప్రొ ఖలీస్తాన్ నినాదాల నేపథ్యంలో బెయిల్ ఇవ్వకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

దిశా రవి పీజేఎఫ్, ఏఎస్జీ ఎస్వీ రాజుతో సన్నిహితంగా మెలిగారని అంటున్నారు. ఏదైనా అంశానికి సంబంధించి తాము ఆందోళన చేయొచ్చు అని దిశా రవి తరఫున న్యాయవాది అన్నారు. దానికే తమ క్లయింట్ను దేశ ద్రోహిగా అభివర్ణించడం సరికాదని చెప్పారు. తన క్లయింట్ రైతులను సమర్థించడమే పాపమైపోయిందా అని అడిగారు.












Click it and Unblock the Notifications