ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : దక్షిణాదిలో బీజేపీకి గడ్డుకాలమే.. ఏపీ, తెలంగాణలో ఖాతా తెరిచే ఛాన్సే లేదు
ఉత్తరాదిలో సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిలో మాత్రం చతికిలపడినట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ను బట్టి తెలుస్తోంది. దక్షిణభారతంలో మొత్తం 128సీట్లు ఉండగా.. బీజేపీకి మాత్రం చేదు అనుభవమే మిగలనున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కర్నాటకలో మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఖాతాయే తెరవదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ 27, కాంగ్రెస్ 53, ఇతరులు 48సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. కర్నాటకలో మాత్రం బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడిందని, అక్కడ 28సీట్లలో బీజేపీ 15, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 13 స్థానాల్లో గెలుపొందుతాయని ఏబీపీ సర్వే స్పష్టం చేసింది.
20 స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ 16, ఇతరులు 4 సీట్లు గెలుచుకుంటారని ఏబీపీ అంచనా వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో , తెలంగాణలో బీజేపీ ఖాతా తెరిచే ప్రసక్తేలేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఏపీలో 25సీట్లలో వైఎస్ఆర్సీపీ 20 స్థానాల్లో విజయం సాధించనుండగా.. టీడీపీ 5 సీట్లు గెల్చుకోనుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 17లో 16స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది.

-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications