యోగి సంచలనం: ఇకనుంచి ఆ సెలవులు 'కట్'! ఎందుకు?
మహానీయుల చరిత్రను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని,ఇకపై మహనీయుల పుట్టిన రోజుల నాడు పాఠశాలలకు సెలవులు ఉండవని తెలిపారు.
లక్నో: మహానీయుల జన్మదినం రోజు సెలవు దినం పాటించడం ఏళ్లుగా దేశంలో ఆనవాయితీగా వస్తోంది. ఇదే పరంపరలో మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినాన్ని సైతం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని ఓవైపు కొత్త డిమాండ్ కూడా వినిపిస్తోంది.
ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇకనుంచి మహానీయులు జన్మదినాన సాధారణ సెలవును రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహానీయుల చరిత్రను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన రోజున సెలవు తీసుకోవడం సరికాదని,ఇకపై మహనీయుల పుట్టిన రోజుల నాడు పాఠశాలలకు సెలవులు ఉండవని తెలిపారు.

బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రసంగించిన యోగి.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అదే సమయంలో అబ్దుల్ కలాం గురించి యోగి గుర్తుచేశారు. కలాం మరణించినప్పుడు విద్యాసంస్థలకు సెలవు ఇస్తే విమర్శలు వచ్చాయని అన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకోని ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు.












Click it and Unblock the Notifications