కూలిన విమానంలో మనవాళ్లు లేరు: అశోక్ గజపతి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో కూలిన మలేషియా విమానంలో భారతీయులు ఎవరూ లేరని భారత పౌర విమాన యానాల మంత్రి పి. అశోక్ గజపతి రాజు చెప్పారు. సంఘటన అత్యంత దురదృష్టకరమైందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ మీదుగా రావద్దని ప్రభుత్వం ఇప్పటికే భారత విమానయాన సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు.
రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్లో క్షిపణితో దాడి చేయడంతో మలేషియా విమానం కూలిపోయి 298 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మన పౌరుల భద్రత తమకు ముఖ్యమని మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ దారిలో రావద్దని భారత తన సొంత ఎయిర్ లైన్స్ జెట్ లేదా ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం ఆదేశించిందని ఆయన చెప్పారు. భారతీయుల ప్రాణాలు పోలేదనే సమాచారం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు.

ఐరోపాకు, ఉత్తర అమెరికాకు వెళ్లే రెండు విమానాలను కూడా ఉక్రెయిన్ మార్గంలో రాకుండా చూడాలని ఎయిర్ ఇండియాకు, జెట్ ఎయిర్వేస్కు పౌరవిమాన యానాల ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ గురువారంనాడే సూచనలు చేశారు.
అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఉక్రెయిన్ వంటి ఉద్రిక్త ప్రాంతాల ఎయిర్ స్పేస్ను వాడుకోవడం లేదని ఎయిర్ ఇండియా అధికారులు అంటున్నారు. ఉక్రెయిన్ మీది మార్గం ఐరోపాను, ఆసియాను కలుపుతుంది. ఇది రద్దీగా ఉంటుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications