Petrol Diesel :పెట్రోల్, డీజిల్ పై తేల్చేసిన కేంద్రం..! గ్యాస్ సమస్యకు వారే కారణం..!
ఇరాన్ వార్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ (petrol), డీజిల్ (diesel)కూ, గ్యాస్ (LPG)కంపెనీల వద్ద ఎల్పీజీ సిలెండర్ల కోసం జనం క్యూలు కడుతున్నారు. ఓవైపు కేంద్రం ఎలాంటి కొరత లేదని చెప్తున్నా..జనం నమ్మే పరిస్ధితి దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి చమురు ఉత్పత్తుల కొరత అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమాధానం ఇచ్చారు.
పశ్చిమాసియాలో హింస పెరుగుతున్నప్పటికీ మన ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తేల్చేశారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్ లేదా ఇంధన చమురు కొరత లేదన్నారు. పెట్రోల్, డీజిల్, విమానయానం, ఇంధన చమురు లభ్యతపై పూర్తి హామీ ఇచ్చారు. మరోవైపు ఎల్బీజీ గ్యాస్పై భయాందోళనలకు వినియోగదారుల ఆతృతే కారణమని తేల్చేశారు.

హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ అంతరాయం ఉన్నప్పటికీ భారత నాన్-హార్ముజ్ ముడి చమురు దిగుమతుల వాటా 70 శాతానికి పెరిగిందని ఆయన తెలిపారు. కాబట్టి దేశ ముడి సరఫరా సురక్షితంగా ఉందన్నారు. రికార్డు చరిత్రలో మొదటిసారిగా సముద్ర మార్గం వాణిజ్య నౌకలకు మూసివేయబడిన తర్వాత ప్రపంచం ఇంధన చరిత్రలో ఇలాంటి క్షణాన్ని ఎదుర్కోలేదని ఆయన అంగీకరించారు. దేశవ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ల ఆందోళన నేపథ్యంలో వాణిజ్య ఎల్పీజీ లభ్యతపై ఉన్న ఆందోళనలను కేంద్రం తోసిపుచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికే వాణిజ్య ఎల్పీజీని నియంత్రించామని, హాస్పిటాలిటీ రంగాన్ని శిక్షించేందుకు కాదని తెలిపింది.












Click it and Unblock the Notifications