ఓట్ల లెక్కింపు ముగిసిన మరుసటి రోజే..
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. బెయిల్ గడువు నేటితో ముగియనుంది. ఆదివారం నాడు ఆయన సరెండర్ కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ రోస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అనారోగ్య కారణాలను చూపారు. ఆరోగ్యం బాగుండట్లేదని, షుగర్తో బాధపడుతున్నట్లు ఈ మధ్యంతన పిటీషన్లో పేర్కొన్నారు.

మొత్తం రెండు పిటీషన్లను దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఒకటి- రెగ్యులర్ బెయిల్కు సంబంధించినది. మరొకటి అనారోగ్య కారణాలతో కనీసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించలంటూ రెండో పిటీషన్ వేశారు వీటిపై రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా వాదనలను విన్నారు.
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్కు పాల్పడ్డారని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు సాగించాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణ సందర్భంగా ఆయన ఎలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించలేదని, పైగా దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని అన్నారు.
ఈ వాదనలు నేటితో ముగిశాయి. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పిిటీషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తన తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 5వ తేదీన వీటిపై తీర్పును వెలువడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ముగుస్తుంది. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్ బెయిల్ భవితవ్యం ఏమిటనేది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ధారిస్తుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications