శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ ట్వీట్: ఏకేసిన నెటిజన్లు
Recommended Video

న్యూఢిల్లీ: ప్రముఖ నటి శ్రీదేవికి శ్రద్దాంజలి ఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్ను తొలగించింది.
శ్రీదేవికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న కాలంలోనే పద్మశ్రీ పురస్కారం లభించిందనే విషయాన్ని ట్విట్టర్లో పేర్కొంది.శ్రీదేవి మృతికి సంతాపం తెలుపుతూ ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రస్తావించింది.

ఈ ట్వీట్పై నెటిజన్లు నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయమై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్ను తొలగించింది.
ఇలాంటి సమయంలో కూడ రాజకీయాల కోసం తాపత్రయ పడడం సరైన పద్దతి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ట్వీట్ కారణంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఆ ట్వీట్ను తొలగించింది.












Click it and Unblock the Notifications