అంత్యక్రియలయ్యాక ఇంటికొచ్చింది: చనిపోయిందెవరు,, ఏమైందంటే?
నోయిడా: చనిపోయిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఓ వివాహిత ఇంటికి తిరిగి వచ్చింది. వివాహిత మరణానికి భర్తే కారణమని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మరణానికి భర్త కారణమని తేల్చారు అయితే అదే సమయంలో వివాహిత ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే విషయమై ఆరా తీస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో రాజ్, సర్వేష్ దంపతులు తమ కూతురు నీతూ అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఆమె అదృశ్యం కావడానికి భర్తే కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే నీతూ లాంటి మృతదేహం లభించడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కూతురు తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంత్యక్రియలు చేశాక ఇంటికొచ్చింది
గ్రేటర్ నోయిడాలోని రాజ్, సర్వేష్ దంపతుల కూతురు నీతూ ఏప్రిల్ 6వ తేదిన అదృశ్యమైంది. ఆమె అదృశ్యం కావడానికి భర్త రామలక్ష్మణ్ కారణమని నీతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏప్రిల్ 24వ తేదిన తీవ్ర గాయాలతో పడి ఉన్న మృతదేహం గురించి నీతూ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.ఆ మృతదేహం తమ కూతురిదేనని భావించి వారు అంత్యక్రియలు నిర్వహించారు.

27 రోజుల తర్వాత ఇంటికి నీతూ
నీతూ చనిపోయిందని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, అందరిని ఆశ్చర్యపరుస్తూ నీతూ 27 రోజుల తర్వాత ఇంటికి చేరుకొంది.తానే నీతూ అంటూ పోలీసులను ఆశ్రయించింది. కుటుంబసభ్యులు కూడ నీతూ ఇంటికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

నీతూ భర్తకు సంబంధం లేదని తేల్చిన పోలీసులు
నీతూ అదృశ్యం కావడానికి భర్తే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. అయితే నీతూ అదృశ్యానాకి ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో నీతూ భర్తను పోలీసులు వదిలేశారు.దీంతో కేసు మళ్ళీ మొదటికొచ్చింది.

పూరణ్తో ఉంటున్న నీతూ
నీతూ తల్లిదండ్రులు నిర్వహించే కిరాణ దుకాణానికి పూరణ్ అనే వ్యక్తి వచ్చేవాడు. సిగరెట్ల కోసం ప్రతి రోజు ఈ షాపుకు వచ్చేవాడు. అయితే కొంత కాలంగా ఈ దుకాణానికి అతను రావడం మానేశాడు. ఈ విషయాన్ని నీతూ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఈ విషయమై పూరణ్ ను పోలీసులు విచారించారు.ఈ విచారణలో నీతూ తనతోనే ఉంటుందని ఆయన అంగీకరించాడు.అయితే అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే విషయం తేలాల్సి ఉంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications