విజయ మాల్యాకు ముంబై కోర్టు షాక్
విజయ మాల్యాకు షాక్ తగిలింది. ముంబై కోర్టు ఆయనకు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిని సీబీఐ యూకేకు బదలాయించనుంది.
న్యూఢిల్లీ: విజయ మాల్యాకు షాక్ తగిలింది. ముంబై కోర్టు ఆయనకు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి, మనీ లాండరింగుకు పాల్పడిన కేసులో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
ఈ వారెంటును సీబీఐ యూకేకు బదలాయించనుంది. బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి, ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు. మాల్యాను భారత్ పంపించాలని కోరుతూ నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద ఈ వారెంటును సీబీఐ యూకేకు పంపిస్తుంది.

ముంబైలోని పిఎంఎల్ఏ కోర్టులో మాల్యా ఈ ఏడాది జూలైలో హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలను ఆయన బేఖాతరు చేశారు. మాల్యా కోర్టు ఎదుట హాజరుకాలేదు. మార్చిలో దేశం విడిచిపోయిన మాల్యా పైన పలు చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులోను ముంబై కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు ముంబై స్పెషల్ కోర్టు ఝలక్ ఇచ్చింది.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications