నాలుగవ విడత పోలింగ్కు నోటిఫికేషన్
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాల్గో దశ పోలింగ్కు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 29న జరగనున్న నాల్గో దశలో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్లకు సంబంధించి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఏప్రిల్ 10న ఈసీ వాటిని పరిశీలించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ ఏప్రిల్ 12 వరకు అవకాశమిచ్చింది.

నాలుగో విడతలో బీహార్లోని 5స్థానాలు, జార్ఖండ్లో 3, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 17, ఒడిశాలో 6, రాజస్థాన్, యూపీలోని 13, బెంగాల్లోని 8 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications