Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో తొలిసారి: అహ్మదాబాద్ పార్కులో ప్రత్యక్షమైన ‘మిస్టీరియస్ మోనోలిత్’

అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మిస్టీరియస్ మోనోలిత్(ఏకశిల) భారతదేశంలో తొలిసారిగా దర్శనమిచ్చింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని పబ్లిక్ పార్కులో అరడగులు పొడవున్న లోహంతో కూడిన ఏకశిల రాత్రి రాత్రే ప్రత్యక్షమైంది.

ఈ శిల భూమిలో పాతిపెట్టినట్లు ఉంది కానీ, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై పార్కు తోటమాలి ఆశారామ్ స్పందిస్తూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను క్రితం రోజు సాయంత్రం చూసినప్పుడు అసలు దాటి ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని తెలిపాడు.

 Now, mysterious monolith sighted in Ahmedabad; first in India

ఆ లోహ శిల త్రిభుజాకారంగా ఉండి, దానిపై ఏవో కొన్ని అంకెలు, గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఏకశిల గురించి ప్రచారం జరగడంతో అనేక మంది ప్రజలు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండటం ఆ పార్కు సందడిగా మారింది.

కాగా, ఈ ఏకశిలలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాల్లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే మిగిలాయి. ఈ మోనోలిత్ అమెరికాలోని ఉటా ఎడారిలో తొలుత ప్రత్యక్షమైనట్లు గుర్తించబడింది.

ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియాలో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ మిస్టీరియస్ మోనోలిత్ దానికదే అదృశ్యమవడం గమనార్హం. అహ్మదాబాద్‌లో ప్రత్యక్షమైన ఈ నిర్మాణం ఎంతకాలం ఉంటుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+