వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలు కోటిన్నర..! ఓట్లున్నాయి 70 వేలే.. 0.5 శాతమేనా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Elections 2019 : ఎన్నారైలు కోటిన్నర ఓట్లు మాత్రం 70 వేలే...!! | Oneindia Telugu

ఢిల్లీ : దేశం వీడి విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య అక్షరాలా కోటి ముప్పై లక్షలు. మరి అందులో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య చూస్తే ఆశ్చర్యమే. ఇక లెక్కల్లో ఎక్కాలు చూస్తే మరింత కంగుతినాల్సిందే. ఎందుకంటే కోటి ముప్పై లక్షల మందిలో కనీసం ఒక్క శాతమైనా (1 లక్ష 30 వేలు) ఓటర్లుగా నమోదు కాలేదు. కేవలం 71 వేల మంది మాత్రమే ఓటర్లుగా రిజిస్టరయ్యారు. అంటే 0.5 శాతం అన్నమాట.

ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్

అందులో ఎంత?.. అంత తక్కువా..!

అందులో ఎంత?.. అంత తక్కువా..!

తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నారైలకు ఓటు హక్కు ఉన్నది 71వేల పైచిలుకు మాత్రమే. అందులో 92 శాతం మంది కేరళవాసులేనట. అంటే దాదాపు 66 వేల మంది వాళ్లే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నారై సంస్థలు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడి ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదనే ఆరోపణలున్నాయి.

అప్పుడు 10వేలు.. ఇప్పుడు 70వేలు

అప్పుడు 10వేలు.. ఇప్పుడు 70వేలు

2010లో చట్టంలో కొన్ని మార్పుల కారణంగా ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించడం మొదలుపెట్టారు. ఇతర దేశాల్లో నివసిస్తూ.. అక్కడ పౌరసత్వం తీసుకోని భారతీయులకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దాదాపు ఈ ఎనిమిదేళ్లలో కూడా ఓటర్ల సంఖ్య అంతలా పెరగకపోవడం గమనార్హం. 2012 సంవత్సరం నుంచి ఎన్నికల సంఘం ఎన్నారై ఓటర్ల జాబితా ప్రచురిస్తోంది. 2010, 2011, 2012.. అలా ఆ మూడు సంవత్సరాల్లో కేవలం 10 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు.

28 రాష్ట్రాల్లో 5వేలు.. ఒక్క కేరళలో 66వేలు

28 రాష్ట్రాల్లో 5వేలు.. ఒక్క కేరళలో 66వేలు

2012 నాటికి ఎన్నారై ఓటర్లు 10 వేల మంది ఉంటే.. 2018 నాటికి 24,507 మంది నమోదయ్యారు. అంటే ఆరేళ్లల్లో కేవలం 14 వేల మంది మాత్రమే ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక 2019 తాజా జాబితా చూసినట్లయితే ఆ సంఖ్య దాదాపు మూడింతలైంది. ప్రస్తుతం 71 వేల 735 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అందులో కేరళ వాటా 92 శాతంతో 66 వేల 584 మంది ఓటర్లు రిజిస్టరయ్యారు. అంటే మిగిలిన 28 రాష్ట్రాల వాటా 5 వేల 151 మంది మాత్రమే కావడం గమనార్హం.

అటు ఎన్నికల సంఘం ఎన్నారై ఓటర్ల నమోదుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. నమోదు ప్రక్రియ కొంత క్లిష్టతరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తద్వారా ఓటు నమోదు కోసం ఎన్నారైలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదనలున్నాయి. అదలావుంటే ఈ సంవత్సరం ఎన్నారై ఓటర్ల జాబితాలో 20 మంది హిజ్రాలు ఉండటం విశేషం.

English summary
The number of people who live abroad is literally millionaires. It is surprising to see the number of registered voters. Because at least one percent of the millionaires (1 lakhs 30 thousand) are not registered as voters. Only 71,000 people were registered as voters. That is 0.5 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X