వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసును ఉపసంహరించుకున్న ఆప్ ఎమ్మెల్యేలు: ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనర్హత వేటు పడిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.

లాభదాయక పదవుల్లో ఉన్నారనే కారణంతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాష్ట్రపతి ఆదివారంనాడు ఆమోద ముద్ర వేశారు.

Office of Profit case: Disqualified AAP MLAs withdraw plea

ఈసి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆరుగురు శాసనసభ్యులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు సోమవారంనాడు తేల్చి చెప్పింది.

అనర్హతపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దరఖాస్తుల వల్ల ఫలితం లేదని ఓ ఆప్ ఎమ్మెల్యే తరఫున వాదిస్తున్న న్యాయవాది చెప్పారు. అందుకే పిటిషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్ల వల్ల ఫలితం లేదని భావించి, వాటిని ఉపసంహరించుకున్నారు. తాజాగా వేరే పిటిషన్లను దాఖలు చేయాలని వారు భావిస్తన్నారు.

English summary
The disqualified Aam Aadmi Party (AAP) MLAs have withdrawn their petition in which they had sought stay on the Election Commission order
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X