ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఓంప్రకాశ్ రావత్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న ఎకే జ్యోతి సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా న్న ఓం ప్రకాష్ సీఈసిగా మంగళవారంనాడు బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఓ ప్రంకాశ్ గతంలో భారీ పరిశ్రమల శాఖలోని ప్రభత్వ సంస్థల విభాగం కార్యదర్శిగా పనిచేశారు.
రక్షణ శాఖలో డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. జ్యోతి పదవీ విరమణతో ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎన్నికల కమిషన్లో ఓ స్థానం ఖాళీ అవుతోంది. ఆ స్థానంలో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాాను ఎన్నికల కమిషనర్గా నియమించింది.
రాజస్థాన్కు చెందిన అశోక్ 1980వ బ్యాచ్ హర్యానా ్యాడర్ ఐఎఎస్ అధికారి. నిరుడు అక్టోబర్ 1వ తేదీన ఆర్థిక కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కాగా, ఓం ప్రకాశ్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది.