Opinion Poll: యూపీలో బీజేపీ సునాయాస విజయం, రెండోసారి సీఎంగా యోగి, 250 సీట్లు
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు ఓపీనియన్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, టైమ్స్ నౌ-నవభారత్ వేటో(వీఈటీవో) ఓపినియన్ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు కూడా బీజేపీ మరోసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలిపింది.

రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్
1985 తర్వాత యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొంది. ఈ ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 403 సీట్లలో 230-249 స్థానాల్లో విజయం సాధించనుందని వేటో టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన ఓపినియన్ పోల్స్లో తేలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 325 సీట్లు రావడం గమనార్హం.

యూపీ ఎన్నికల్లో పుంజుకోనున్న అఖిలేష్ పార్టీ..
ఇక మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూటమికి 137-152 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఓపినియన్ పోల్ వెల్లడించింది. మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ)కి 9-14 సీట్ల, ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితం కానుందని పేర్కొంది. 2017లో కంటే బీజేపీ కూటమికి ఓటు షేర్ తగ్గనుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 38.6 శాతం ఓట్ షేర్ రానుంది. ఎస్పీ కూటమికి 2017 ఎన్నికల్లో కంటే ఎక్కువగా 34.4 శాతం ఓటు షేర్ రానుంది. బీఎస్పీకి 2017లో 22.2 శాతం ఓటు షేర్ రాగా, వచ్చే ఎన్నికల్లో 14.1 శాతానికి పడిపోనుందని తెలిపింది. ఈ పార్టీ ఓటు షేర్ ను బీజేపీ, ఎస్పీ పంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.
Recommended Video

లఖింపూర్ ఖేరీ ఘటన మినహా బీజేపీకి అంతా సానుకూలమే
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతుందని యూపీలో మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీ ప్రజలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఓపినియన్ పోల్స్ తేల్చింది. లఖింపూరఖేరీ ఘటన బీజేపీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ గతం కంటే కొన్ని సీట్లు తగ్గించుకుని అధికారానికి కావాల్సిన మెజార్టీ సీట్లను దక్కించుకుంటుందని తెలిపింది. ఈ ఓపినియన్ పోల్ డిసెంబర్ 16 నుంచి 30 వరకు 21,480 మందితో నిర్వహించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications