ఇటు బెంగళూరులో విపక్షాల భేటీ... అటు ఢిల్లీలో NDA మిత్రపక్షాల సమావేశం.. టార్గెట్ 2024
దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా ఐక్యత రాగం ప్రతిపక్షాలకు దీటుగా బిజెపి కూడా కొత్త ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న చిన్న పార్టీలను కలుపుకుంటూ బీజేపీ నేత్రుత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కూటమిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం నేడు జరగనుంది. మొత్తం ఈ భేటీలో 38 రాజకీయ పార్టీలు పాల్గొంటాయి.
నేడు సాయంత్రం ఐదు గంటలకు అశోక హోటల్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఒకప్పుడు కూటమిలో బిజెపి తర్వాత పెద్ద దిక్కులా వ్యవహరించిన కొన్ని పార్టీలకు ఈ భేటీకి ఆహ్వానం అందలేదు. అందులో ముఖ్యంగా శిరోమణి అకాలీదళ్, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి . ఎన్డీయే ను బలోపేతం చేయడం కోసం కమలనాధులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన, తమిళనాడు అన్నాడీఎంకే, మహారాష్ట్ర శివసేన ఏకనాథ్ షిండే వర్గం, ఎన్సిపి అజిత్ పవార్ వర్గం, రాష్ట్రీయ లోక్ సమత పార్టీకి చెందిన ఉపేంద్రకుశ్వాహా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ తదితరులకు ఆహ్వానం అందింది. గతానికి భిన్నంగా ఈ దఫా ఐదు శాతం కంటే తక్కువ ఓటుబ్యాంకు ఉన్న చిన్నపార్టీలతో జత కడుతున్నారు. 2024 ఎన్నికల లక్ష్యంగా బిజెపిని ఎదుర్కోవడానికి విపక్షాలకూటమి బెంగళూరులో కీలకభేటీని నిర్వహిస్తోంది.
నిన్న రాత్రి రెండు గంటల పాటు సాగిన ఈ కీలక భేటీలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ను ఫిక్స్ చేసే పనిలో విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్నీ ఎన్డీఏ ను ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తాయని భేటీ అనంతరం మల్లికార్జున ఖర్గే తెలిపారు.
బెంగళూరులో జరుగుతున్న ఈ విపక్షాల కీలక భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీసీఎం తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు కూడా విపక్ష పార్టీలు కీలక భేటీ నిర్వహించి వచ్చే ఎన్నికలలో గద్దె దించడానికి ఏం చేయాలి అన్నది వ్యూహాలు సిద్ధం చెయ్యనున్నారు. విపక్షాల తొలిరోజు భేటీకి ఎన్సిపి అధినేత శరత్ పవార్ హాజరు కాలేదు. అయితే నేడు ఆయన సుప్రియ సూలేతో పాటు భేటీకి హాజరవుతారని సమాచారం. ఇటు విపక్షాలు కూడా ఎన్డీఏ కూటమికి దీటుగా ఐక్య కూటమిని ఏర్పాటు చేసి ఐక్య కూటమి పేరు ఖరారు చేసి లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంది. దీంతో రెండు కీలక భేటీల నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications