ఎట్టకేలకు విలీనం: పన్నీరు డిమాండ్లకు పళని ఓకే, శశికళకు షాక్
ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.
చెన్నై: ఎట్టకేలకు అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. విలీనంపై మాజీ సీఎం పన్నీరుసెల్వం సోమవారం ప్రకటన చేశారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పన్నీరు, పళని వర్గాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా పన్నీరు విలీన ప్రకటన చేశారు. పన్నీరు డిమాండ్లకు పళనిస్వామి ఒకే చెప్పారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించేందుకు అంగీకరించారు. అలాగే, పన్నీరు వర్గం నేతలకు ఆర్థిక, గృహ, హోంశాఖలు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామని చెప్పారు. తమను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. అమ్మ ఆత్మ, కార్యకర్తల కోరికతో విలీనం జరిగిందని చెప్పారు.
కాగా, విలీనం నేపథ్యంలో పన్నీరు సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నారు. పన్నీరు సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications