వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శశికళ హెచ్చరిక, రాజ్ భవన్ వద్ద రౌడీ గ్యాంగ్: నిఘా నీడలో చెన్నై
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ గవర్నర్ను హెచ్చరించిన నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద, చెన్నైలో భద్రతను పెంచారు. పార్టీలో చీలిక తెచ్చేందుకే ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ గవర్నర్ను హెచ్చరించిన నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద, చెన్నైలో భద్రతను పెంచారు. పార్టీలో చీలిక తెచ్చేందుకే ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు.
అలా చేస్తే తనలోని మరో కోణం చూపిస్తానని హెచ్చరించారు. దీంతో నిఘా వర్గాల హెచ్చరిక మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
చెన్నైలోని హోటళ్లు, పెద్ద పెద్ద భవంతులు, కల్యాణ మండపాలలో శనివారం పోలీసుల పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అక్కడ బస చేస్తున్నవారి వివరాలను సేకరించారు. హోటళ్లలో రికార్డులను పరిశీలించారు. అందరి గురించి ఆరా తీశారు.
గవర్నర్కు శశికళ హెచ్చరికలు, గొంతు పెంచిన చిన్నమ్మ
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని భావిస్తూ యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
jayalalithaa poes garden sasikala sasikala natarajan aiadmik tamil nadu panneerselvam Governor subramanian swamy vidyasagar rao శశికళ పోయెస్ గార్డెన్ అన్నాడీఎంకే తమిళనాడు పన్నీరుసెల్వం
English summary
On Saturday Sasikala Natarajan alleged that the Governor is delaying his decision to split the AIADMK. However sources in the Raj Bhavan say that that the Governor only wants a stable government in Tamil Nadu. No decision from Raj Bhavan will be made until Tuesday or Wednesday, sources also point out.
Story first published: Sunday, February 12, 2017, 10:29 [IST]