ఆశ్చర్యం: గంగానదిలో తేలిన వందకుపైగా శవాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ - ఉన్నావో మధ్యలో గంగా నదిలో అకస్మాత్తుగా 100కు పైగా మృతదేహాలు మంగళవారనాడు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సమాచారం అందుకున్న కాన్పూర్ అధికారులు విచారణకు ఆదేశించారు. గంగానదిలో మృతదేహాలను వేయడం సర్వసాధారణమని, గంగా ప్రవాహం తగ్గటంతోనే ఇలా ఒక్కసారిగా మృతదేహాలు తెలాయని అధికారులు భావిస్తున్నారు.
నదిలో తేలిన శవాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మోక్షం లభిస్తుందనే నమ్మకంతో గంగానదిలో శవాలను నిమజ్జనం చేసి ఉంటారని, అయితే అకస్మాత్తుగా ఇంత పెద్ద యెత్తున శవాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారని అంటున్నారు.

అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అదనపు పోలీసు సూపరింటిండెంట్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆ ప్రాంతానికి వెళ్లారు. గంగానదిలో నీరు తగ్గిందని, అందుకే శవాలు తేలి ఉంటాయని ఉన్నావో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సర్యూ ప్రసాద్ అన్నారు.
ఆ సంఘటనతో గంగానదిలో మృతదేహాల నిమజ్జనానికి వ్యతిరేకంగా పర్యావరణ సంఘాలు గొంతు ఎత్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుడు జులైలో గంగా ప్రక్షాళణ శాఖను ఏర్పాటు చేసి, రూ.2037 కోట్లు కేటాయించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications