"అది వార్మ్- అప్ మాత్రమే.. నెక్స్ట్ 60 జెట్లు కూల్చేస్తాం".. భారత్ కు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వార్నింగ్
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్(PAF) మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ లో సెప్టెంబర్ 6 న డిఫెన్స్ డే సందర్భంగా పాకిస్థాన్ లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు పరేడ్ లు, విన్యాసాలు నిర్వహించాయి. ఈ సమావేశంలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మే 10న పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ బన్ యాన్ మర్సూస్ లో భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ను కూల్చేశామని.. పాకిస్థాన్ ఒక్క జెట్ ను కూడా కోల్పోలేదని కీలక ఆరోపణలు చేశారు. పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో తమ స్కోరు 6-0 అని అన్నారు. అది వార్మ్- అప్ మాత్రమేనని భవిష్యత్తులో అల్లాహ్ కోరుకుంటే ఆ స్కోరును 60-0 కు తీసుకెళ్తామని ప్రగల్భాలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
🚨BREAKING: PAF warns India
— The Daily CPEC (@TheDailyCPEC) September 6, 2025
“6-0 was only the warm-up — next time it’ll be 60-0.” pic.twitter.com/jwouUoNqpe
ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మే 10న పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ బన్ యాన్ మర్సూస్ లో తాము భారత్ లోని అనేక ఎయిర్ బేస్ లను టార్గెట్ చేశామని అందులో ఉదంపూర్ ఎయిర్ బేస్, పథాన్ కోట్, అదమ్ పుర్ ఎయిర్ బేస్ లు ఉన్నట్లు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. దీంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.

వాటిలో ముజఫరాబాద్ లో ఉన్న సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అంతేకాక వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత పాకిస్థాన్ ధ్వంసం అయిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మించుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications