గిన్నిస్ బుక్లో ఎల్పీజీ నగదు బదిలీ పథకం ‘పహల్’
న్యూఢిల్లీ: వంటగ్యాసు వినియోగదారులకు నగదు రాయితీ అందజేయడానికి ఏర్పాటు చేసిన నగదు బదిలీ పథకాని(పహల్)కి గిన్నిస్ బుక్లో స్థానం లభించిందని కేంద్రం తెలిపింది. ప్రపంచంలోనే భారీ నగదు బదిలీ పథకంగా గిన్నిస్ బుక్ పేర్కొందని తెలిపింది.
2014, నవంబర్ 15న పహల్ పథకంలో దేశంలోని 54 జిల్లాలు చేరాయి. ఆ తర్వాత 2015, జనవరి 1న దేశంలోని మొత్తం జిల్లాలు ఈ పథకం కిందికి వచ్చాయి.

ఇప్పటివరకు 13.9 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు 'పహల్' పథకంలో చేరారని కేంద్రం పేర్కొంది. తద్వారా ఏటా 9 వేలకోట్లు ఆదా అవుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications