ఇంకా దక్షిణ కశ్మీర్లోనే పహల్గాం తీవ్రవాదులు ? ఎన్ఐఏ షాకింగ్ ..!
కశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు కాశ్మీర్ ను జల్లెడ పట్టడం ప్రారంభించాయి. దాదాపు వారం రోజులుగా కాశ్మీర్ ను బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. అయినా ఇంకా ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్ లోనే తలదాచుకున్నారన్న షాకింగ్ వాస్తవాన్ని ఎన్ఐఎ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇంకా వాళ్లను ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అయితే అప్పటి నుంచీ ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. సైన్యం, స్థానిక పోలీసులతో కూడిన భారీ వేట నుండి వీరు తప్పించుకుని తిరుగుతున్నారు. పరారీలో ఉన్న వారు ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు ఎన్టీడీవీకి వెల్లడించాయి. వారు దట్టమైన అడవుల్లో దాక్కుని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉగ్రవాదులు తమ వెంట సరుకులను తీసుకువెళుతుండవచ్చని ఎన్ఐఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అడవుల్లో దాక్కుని ఉండటం వల్ల బలగాలకు దొరకడం లేదని తెలుస్తోంది. దీంతో అడవుల్లో అణువణువూ గాలించడం భద్రతా బలగాలకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. అయినా భద్రతా బలగాలకు తోడుగా స్ధానిక పోలీసులు సైతం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటూ ఉగ్రవాదుల జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే పహల్గాం దాడిలో ఉగ్రవాదులు అత్యాధునిక యాప్ ఆధారిత కాల్స్ చేసుకుని రాడార్లకూ, నిఘా వర్గాలకూ అంతుబట్టకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు తప్పించుకుని తిరగడంలోనూ ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఉపయోగిస్తూ ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలకు ఈ వేట సవాలుగా మారుతోంది. మరోవైపు వీరిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలన్న ఒత్తిడి కేంద్రంపై పెరుగుతోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications