ముంబైపై దాడి కోసం 8 ఇంజిన్లు అమ్మిన పాక్ కంపెనీ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ముంబైలో దాడులకు సహకరించిన వారికి పాకిస్థాన్కు చెందిన ఓ కంపెనీ 8 యమహా ఇంజిన్లు అమ్మినట్లు తేలింది. ముంబై చేరుకునేందుకు చిన్న పడవల్లో ఉపయోగించేందుకు కసబ్ సహా ఉగ్రవాదులకు ఇంజిన్లు అందజేసినట్లు వెల్లడైంది.
సదరు కంపెనీకి చెందిన జనరల్ మేనేజర్ ఒకరు బుధవారం ఉగ్రవాద నిరోధక న్యాయస్థానానికి ఈ విషయాలను తెలియజేశారు. రావల్పిండిలోని అడియాల జైలులోని న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో దీనిపై అతడు సాక్ష్యం చెప్పారు.

పరారీలో ఉన్న నిందితుడు అజాంఖాన్కు ఇంజిన్లు అమ్మినట్లు తెలిపారు. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇంజిన్లకు తమ విభాగం అనుమతి పత్రం ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారి ఒకరు సాక్ష్యం చెప్పారు.
ఆ ఇంజిన్ల సహాయంతో ముంబై చేరుకున్న కసబ్ సహా మిగితా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాగా, ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మరో ఆరుగురు నిందితులు అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications