'మహిళలు మొబైల్ ఫోన్లు వాడొద్దు, జీన్స్ ధరించొద్దు'
లక్నో: మహిళలు, యువతులు జీన్స్ ప్యాంటులు ధరించరాదని, మొబైల్ ఫోన్లు వాడకూడదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ సమీపంలో సమావేశమైన ఓ కుల పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లు ఫేస్బుక్, వాట్సప్ వంటి వాటిని కూడా ఎవరూ వాడవద్దని ఆదేశించారు.
తమ ఆదేశాలు ముజఫర్నగర్ పరిధిలోని నలభై ఆరు గ్రామాలకు వర్తిస్తుందని పంచాయతీ పెద్దలు చెప్పారు. కాగా, ఈ తరహా ఆదేశాలు ఖాప్ పంచాయతీలు గతంలోను ఇచ్చిన విషయం పలుమార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో ఈ తరహా ఆదేశాలు ఖాప్ పంచాయతీలు ఇస్తుంటాయి.

ఈ ఏడాది ఆగస్టులో పంచాయతీకి చెందిన ఓ కమ్యూనిటీ తమ వర్గానికి చెందిన యువతులు జీన్స్ ధరించవద్దని, మొబైల్ ఫోన్లను వాడవద్దని తీర్మానించారు. జీన్స్ ధరించడం, మొబైల్ ఫోన్లు వాడటం వల్ల చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఈవ్ టీజింగ్ తదితరాలకు ఇదే కారణమని వారు అభిప్రాయపడ్డారు. జాడ్వాద్ గ్రామంలోని గుజ్జార్ కమ్యూనిటీ వారు ఆగస్టు నెలలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పెళ్లి కాని యువతులు ఫోన్లు, జీన్స్ ధరించవద్దని తీర్మానించినట్లు వారు అప్పుడు చెప్పారు. దీని పైన పలువురు మండిపడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications