నోట్ల రద్దు షాకింగ్: స్పీకర్ పైకి పేపర్లు విసిరేసిన ఎంపీ
గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. తద్వారా సభలో దారుణంగా వ్యవహరించారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు ఇరు సభల్లో గందరగోళం చెలరేగుతోంది. గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. తద్వారా సభలో దారుణంగా వ్యవహరించారు.
నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలని లోకసభలో ప్రతిపక్షాలు మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహజన్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.

సమాజ్వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్ కాగితాలు చించి స్పీకర్పైకి విసిరారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు గాను అక్షయ్ యాదవ్పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు.
పెద్దనోట్లను రద్దు చేయడంపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చర్చకు వచ్చి సమాధానాలు చెప్పాలంటూ ఉభయసభల్లో ఆందోళన చేయడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications