పేపర్ దిద్దుకొని 100మార్కులేసుకున్న ఇంటర్ విద్యార్థి
అహ్మదాబాద్: గుజరాత్లో పన్నెండో తరగతి చదువుతున్న హర్షద్ అనే విద్యార్థి తానే పరీక్ష రాసి, తానే పేపర్ దిద్దుకొని వందకు వంద మార్కులు వేసుకున్నాడు. పేపర్ దిద్దేవాళ్లలాగే ఎర్రపెన్నుతో దిద్ది మార్కులు వేసుకొని, పరీక్ష పూర్తయ్యాక సూపర్ వైజర్కు అందించాడు.
ఇంటర్ చదువుతున్న హర్ధద్ మొద్దబ్బాయి. దీంతో, తానే పేపర్ దిద్దుకొని, తానే మార్కులు వేసుకున్నాడు. అతను ఎకనామిక్స్ పేపరును తానే దిద్దుకొని, మార్కులు వేసుకున్నాడు.
పరీక్షను రాసిన విద్యార్థికి వాస్తవంగా 34 మార్కులు మాత్రమే వచ్చాయని, సూపర్ వైజరుకు పేపర్ ఇచ్చే ముందు ఈ ఘటన జరిగిందని, దీనిపై కేసు పెట్టామని రాష్ట్ర సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.

విద్యార్థి నిర్వాకాన్ని గుర్తించని అధ్యాపకుల పైనా కేసు పెట్టినట్టు తెలిపారు. పేపర్ దిద్దే టీచర్లకు అనుమానం రాకుండా ఉండేందుకు మెయిన్ పేజీలో టోటల్ మార్కులను వేయకుండా హర్షద్ జాగ్రత్త పడ్డాడని, పేపర్ దిద్దిన టీచర్, ముందూ వెనుకా చూడకుండా మార్కుల టోటల్ కూడి 100/100 వేసేశాడని చెప్పారు.
హర్షద్కు గుజరాతీలో 13, ఇంగ్లీషులో 12, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, సైకాలజీలో 5, జియోగ్రఫీలో 35 మార్కులు మాత్రమే వచ్చాయని, దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా విషయం వెలుగుచూసిందన్నారు. బాధ్యులందరి పైనా చర్యలు తీసుకుంటామన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications