మోదీ కాళ్లు మొక్కిన పపువా ప్రధాని
న్యూఢిల్లీ/పోర్ట్ మోరెస్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం- జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. జపాన్ పర్యటనను ముగించుకున్న ఆయన తాజాగా పపువా న్యూగినియాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానితో భేటీ కావాల్సి ఉంది.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
జపాన్లోని హిరోషిమాలో ఏర్పాటైన జీ7 సభ్య దేశాల అత్యున్నత స్థాయి సమ్మిట్లో మోదీ పాల్గొన్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్కు ఇందులో సభ్యత్వం ఉంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా.. వంటి దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నాయి. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు.

జపాన్ పర్యటన ముగిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి పపువా న్యూగినియాకు బయలుదేరి వెళ్లారు. ఆ దేశ రాజధాని పోర్ట్ మోరెస్బీలోని జాక్సన్స్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపె స్వయంగా ఎయిర్పోర్ట్లో మోదీకి స్వాగతం పలికారు.. రెడ్ కార్పెట్ పరిచారు. ఆయన గౌరవార్థం పపువా న్యూగినియా కళాకారులు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విమానం నుంచి కిందికి దిగిన వెంటనే జేమ్స్ మరాపె.. మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే మోదీకి పాద నమస్కారం చేశారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ- ఆయన భుజాన్ని తట్టారు. జేమ్స్ మరాపె భుజాలను పట్టి పైకి లేపి, మరోసారి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి తన కాన్వాయ్ వైపు కదిలారు మోదీ.
జేమ్స్ మరాపె.. ప్రధాని మోదీకి పాద నమస్కారం చేయడానికి కారణం లేకపోలేదు. భారత ప్రధాని ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు భారత ప్రధానులెవ్వరూ పపువా న్యూగినియాలో పర్యటించలేదు. తొలిసారిగా తమ దేశ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని కావడం వల్ల మోదీకి జేమ్స్ మరాపె పాదాలను నమస్కరించి స్వాగతం పలికారు.
తన పర్యటన సందర్భంగా మోదీ- ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. సోమవారం ఈ అత్యున్నత భేటీ ఏర్పాటు కానుంది. ఈ ఫోరమ్లో కుక్ ఐలండ్స్, ఫిజీ, కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలండ్స్, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పపువా న్యూగినియా, సమోవా, సాల్మన్ ఐలండ్స్, టోంగా, టువాలు, వనవాటు ఉన్నాయి. 2014లో మోదీ తన ఫిజీ పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ను ప్రారంభించారు.
-
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications