Parliament day 14: రాజ్యసభలో ఫ్యామిలీ కోర్టుల బిల్లు ఆమోదం-ఇరుసభల్లోనూ విపక్షాల నిరసనలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 14వ రోజు ఉభయసభల్లోనూ మరోసారి విపక్షాలు నిరసనలతో రెచ్చిపోయాయి. ముఖ్యంగా ఈడీని అడ్డుపెట్టుకుని కేంద్రం విపక్షాల్ని కక్షసాధించడంపై ఉభయసభలూ అట్టుడికాయి. దీంతో ఇరుసభల్లోనూ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరకు రాజ్యసభలో కుటుంబ న్యాయస్ధానాల చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం ఒక్కటే కేంద్రానికి ఊరటనిచ్చింది.
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడంపై ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ కేంద్రంపై దాడిని తీవ్రతరం చేశారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలలో ప్రతిపక్షాల నిరసనలు మరో రోజు కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి. లోక్సభ కార్యకలాపాలు మొదట మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం ఈడీ వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించడంతో మిగిలిన రోజంతా వాయిదా పడింది.
ఇదే అంశంపై నిరసనల కారణంగా తొలుత మధ్యాహ్నానికి వాయిదా పడిన రాజ్యసభ, పెద్ద ఎత్తున నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించింది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు, 2022 పరిశీలన, ఆమోదం కోసం తీసుకున్నప్పుడు నిరసనలు, నినాదాలు కొనసాగాయి. సభను రేపటికి వాయిదా వేయకముందే గందరగోళం మధ్య బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది.
రాజ్యసభలో
ప్రతిపక్ష
నేత,
కాంగ్రెస్
ఎంపీ
మల్లికార్జున్
ఖర్గే
మాట్లాడుతూ
సభ
జరుగుతున్న
సమయంలోనే
మధ్యాహ్నం
12.30
గంటలకు
ఈడీ
ముందు
హాజరు
కావాలని
తనకు
సమన్లు
అందాయని
చెప్పారు.
సోనియా
గాంధీ,
రాహుల్
గాంధీల
ఇంటిని
అధికారులు
ఘెరావ్
చేశారని,
మమ్మల్ని
భయపెట్టేందుకే
ఇలా
చేస్తున్నారని
ఆరోపించారు.
బెదిరింపులకు
లొంగబోమన్నారు.తాను
చట్టాన్ని
గౌరవిస్తానని,
లా
ఎన్ఫోర్స్మెంట్
ఏజెన్సీ
ముందు
హాజరవుతానని
చెప్పారు.
ప్రస్తుత
ప్రభుత్వం
ఈడీని
నియంత్రించడం
లేదని
రాజ్యసభ
నేత
పీయూష్
గోయల్
అన్నారు.
విపక్షాలు
తమ
ప్రభుత్వం
ఉన్న
సమయంలో
ఈడీని
నియంత్రించారేమో
కానీ,
తమ
ప్రభుత్వం
అలా
చేయదన్నారు.
విపక్ష
సభ్యులు
సభా
వెల్
లోకి
ప్రవేశించి
"తానాషాహీ
(నియంతృత్వం)
నహీ
చలేగీ,
నహీ
చలేగీ"
అంటూ
నినాదాలు
చేస్తూనే
ఉన్నారు.
ప్రధాని
నరేంద్ర
మోదీ
కూడా
సభకు
వచ్చి
తమ
ఆరోపణలపై
స్పందించాలని
డిమాండ్
చేశారు.
అనంతరం
నిరసన
మధ్యే
ఇరుసభలూ
వాయిదా
పడ్డాయి.