లోక్ సభ ప్రశ్నోత్తరాలు-ధాన్యం కొనుగోలుకు టీఆర్ఎస్-మెడికల్ కాలేజీలకు వైసీపీ ఎంపీల వినతి
పార్లమెంటు శీతాకాల సమావేశాల ఐదోరోజు కొనసాగుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఎర్ఎస్, వైసీపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్రం సమాధానం ఇవాల్సి ఉంది. ముందుగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడారు.
తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు భారీ ఎత్తున వరిసాగు చేస్తున్నారని, కానీ కేంద్రం వారు పండించిన వరిని కొనుగోలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నామా ఆరోపించారు. దేశానికి రైతు వెన్నెముక అని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి తెలంగాణ రైతుల నుుంచి యాసంగి వరిని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని నామా కోరారు.

అనంతరం మాట్లాడిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్రంలో భారీ ఎత్తున చేపడుతున్న మెడికల్ కాలేజీల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని, ఇందులో మూడింటికి నిధులు కూడా ఇస్తోందని తెలిపారు. నాడు- నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం పలు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోందన్నారు. ఈ దశలో కేంద్రం కూడా మిగిలిన 13 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేసి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వైద్య వసతులు మెరుగుపర్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కూడా సహకరించాలని ఎంపీ సత్యనారాయణ కోరారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణ కారణంగా దేశానికి గర్వకారణమైన పలు ప్రభుత్వ రంగ సంస్ధలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్రం తక్షణం వీటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నుస్రత్ జహాన్ కోరారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రైవేటీకరణ చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల జాబితాను సైతం ఆమె లోక్ సభలో చదివి వినిపించారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications